– శనివారం ఉదయం పుట్టపర్తికి ప్రయాణం
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 20: తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆమె రాజ్ భవన్కు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసి రాజ్ భవన్లో విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె చేరుకుంటారు. సాయంత్రం 4.00 గంటలకు రాష్ట్రపతి నిలయం వేదికగా నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభిస్తారు. సాయంత్రం 6:15 గంటలకు ఆమె రాజ్ భవన్కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. 22వ తేదీ శనివారం ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు. సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





