యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 1: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రవాణా. బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మంత్రి దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసయగా ఏఈవో రఘు ఆయనకు స్వామివారి ఫొటో, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి-భువనగిరి జిలా్ల కలెక్టర్ హనుమంతరావు కూడా ఉన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





