ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు రేప‌టికి వాయిదా

న్యూదిల్లీ, డిసెంబర్‌ 10: ‌తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు విచారణ సుప్రీంకోర్టులో గురువారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా, కేసు దర్యాప్తునకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి ఒక ముఖ్య విషయాన్ని తెలియజేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌ ‌రావు దర్యాప్తు సంస్థతో ఏమాత్రం సహకరించడం లేదని, దర్యాప్తు సంస్థతో ఆయన ఆటలాడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, కీలకమైన రుజువులను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభాకర్‌ ‌రావు తన ఐక్లౌడ్‌లోని డేటాను డిలీట్‌ ‌చేశారని కూడా న్యాయస్థానానికి వెల్లడించారు. అయితే, ప్రభాకర్‌ ‌రావు తరఫు సీనియర్‌ ‌న్యాయవాది ఆ రోజు అందుబాటులో లేకపోవడంతో, ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కీలక కేసులో విచారణ రేపు కూడా కొనసాగనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *