రోహిత్‌ ‌రెడ్డి డ్రగ్స్ ‌కేసులో కీలక నిర్ణయం

– విచారణకు ‘సిట్‌’ ఏర్పాటుకు ఆదేశం
– చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ ‌నేతృత్వంలో ‘సిట్‌’

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి17: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ ‌నేత పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి ఫామ్‌ ‌హౌస్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ ‌గౌతమ్‌ ‌నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్‌ ‌రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రోహిత్‌ ‌రెడ్డి ఫామ్‌ ‌హౌస్‌లో జరిగిన పార్టీ వ్యవహారంపై సిట్‌ ‌విచారణ చేయనుంది. దుబాయ్‌ ‌లింకులు, డ్రగ్స్ ‌దందా, నమిత్‌ ‌శర్మ రియల్‌ ‌వ్యాపారాలు తదితర అంశాలపై సిట్‌ ‌విచారణ జరపనుంది. ఈ డ్రగ్స్ ‌కేసులో వీటిని ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు? ఈ పార్టీలో పాల్గొనేందుకు వచ్చిన వ్యాపారులు ఎవరు? వారికి కు ఉన్నా లింకులు, దుబాయ్‌ ‌లింకులు తదితర అంశాలపై పలు కోణాల్లో విషయాలను రాబట్టేందుకు ఈ సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి సిట్‌ ‌నివేదికను అందించనుంది. మొయినాబాద్‌లోని పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డికి చెందిన ఫామ్‌ ‌హౌస్‌పై ఆదివారం పోలీసులు అకస్మికంగా దాడి చేశారు. ఈ సమయంలో న్యూఢిల్లీకి చెందిన నమిత్‌ ‌శర్మ.. కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వారిని చుట్టిముట్టారు. ఈ సందర్భంగా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్స్ ‌టెస్ట్ ‌నిర్వహించారు. వారిలో పలువురికి పాజిటివ్‌ ‌వచ్చింది. వారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ ‌కుమార్‌ ‌సైతం ఉన్నారు. ఆయనకు కూడా డ్రగ్స్ ‌పరీక్షల్లో పాజిటివ్‌ ‌వచ్చింది. అలాగే పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డికి పాజిటివ్‌ ‌వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి వారి వారి పార్టీల నుంచి నోటీసులు అందాయి. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ వారికి ఆయా పార్టీలు స్పష్టం చేశాయి. అప్పటి వరకు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నాయి.

రోహిత్‌ ‌రెడ్డి వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ ‌సీరియస్‌ : ‌-షోకాజ్‌ ‌నోటీసులు జారీ 

పైలెట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ ‌బిగ్‌ ‌షాక్‌ ఇచ్చింది. రోహిత్‌కు పార్టీ అధిష్ఠానం షోకాజ్‌ ‌నోటీసులు జారీ చేసింది. ’డ్రగ్స్ ‌కేసులో  ప్రమేయం ఉన్నట్లు మీడియా ద్వారా వార్తలు వచ్చాయి. అదే విధంగా పోలీస్‌ ‌కేసు నమోదు అయిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసినట్లు’ నోటీసుల్లో పేర్కొంది. ఈ వ్యవహారం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్‌ ‌రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ అంశంపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ ఆదేశించింది. గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుంటామని పార్టీ అధిష్ఠానం హెచ్చరించింది. రోహిత్‌ ‌రెడ్డి వ్యవహారాన్ని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత కేసీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై వారం రోజుల్లోగా స్పష్టంగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల బాధ్యులు సోమ భరత్‌ ‌కుమార్‌ ‌షోకాజ్‌ ‌నోటీసు జారీ చేశారు. హైదరాబాద్‌ ‌పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సమావేశంలో హాజరైన సమయంలో, అక్కడ మాదక ద్రవ్యాలు వినిగియోంచారని వివిధ మీడియా నివేదికలు, ఇతర విశ్వసనీయ సమాచారం ద్వారా పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికి వచ్చిందని షోకాజ్‌ ‌నోటీసుల్లో తెలిపారు. ఈ వార్తలు విస్తృతంగా మీడియాలో ప్రసారం కావడంతో పాటు పార్టీకి, ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళనలు కలిగించాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసం కలిగిందని నోటీసుల్లో పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదకద్రవ్యాలు, మత్త పదార్థాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండటాన్ని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ సంఘటనలో పైలర్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టాయని అన్నారు. అలాగే పార్టీ ప్రతితష్ట, విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశాలు కల్పించాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ ఆదేశం మేరకు ఈ నోటీసులు అందిన తేదీ నుంచి 7 రోజుల్లోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై జవాబును స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖితపూర్వక వివరణ సమర్పించాల్సిందిగా నోటీసులు ద్వారా ఆదేశిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై పార్టీ నాయకత్వం సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండాల్సిందిగా ఆదేశించారు. గడువు తేదీలోగా సంతృప్తికరమైన వివరణ సమర్పించకపోతే పార్టీ రాజ్యాంగం, నియమావళి ప్రకారం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే పై తగిన క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *