యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులకు నిత్య పూజలు జరిపారు. అనంతరం ఆలయ ముఖ మండపం నందు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా ప్రత్యేకంగా అలంకరించి రంగురంగుల పూలతో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చనను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



