– హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
పాట్నా, మార్చి 5: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఖ్యాతి సింగ్ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నామినేషన్ పేపర్లను అందజేశారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినట్లు నితీశ్ తన ఎక్స్లో వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం అమిత్ షా పాట్నాకు వచ్చారు. ఆయనకు నితీశ్ స్వాగతం పలికారు. బీహార్కు అత్యధిక కాలం సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా నితీశ్ రికార్డు సష్టించారు. అయితే రాజ్యసభ సభ్యుడు కావాలన్న కాంక్ష ఉన్నట్లు ఆయన తెలిపారు. నితిశ్ తన అభిప్రాయాన్ని ఎక్స్లో వ్యక్తం చేశారు. బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు జరగనున్నట్లు చెప్పారు. నితీశ్ తప్పుకోవడంతో బీహార్కు బీజేపీ అభ్యర్థి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నితీశ్ కుమారుడు నిషాంత్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రెండు దశాబ్దాలపాటు తనపై ప్రజలు నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచారని, దీని ఆధారంగానే బీహార్కు సేవ చేశానని, నమ్మకం, మద్దతుతోనే బీహార్ను కొత్త అభివృద్ధి కోణం వైపు తీసుకెళ్లినట్లు చెప్పారు. తనపై నమ్మకాన్ని ఉంచి మద్దతు ఇచ్చినందుకు గతంలో అనేకసార్లు కృతజ్ఞలు చెప్పినట్లు నితీశ్ పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి బీహార్ అసెంబ్లీ, మండలితోపాటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ సభ్యుడిని కావాలన్న కాంక్ష ఉండేదని చెప్పారు. ఆ కోరికతోనే రాజ్యసభ సభ్యుడిని అయ్యే సందర్భం వచ్చిందన్నారు. భవిష్యత్తులో ఇదే రకమైన సంబంధం కొనసాగుతుందన్నారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. బీహార్ సీఎం పోస్టు రేసులో నిత్యానంద్ రాయ్తో పాటు సమ్రాట్ చౌదరీ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





