– మాజీ చీఫ్ జస్టిస్ట్ సుశీలా కర్కీకి బాధ్యతలు
– జెన్ జెడ్ ఉద్యమకారులు మొగ్గు
ఖాట్మండ్,సెప్టెంబర్ 10: కల్లోల నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగున్న నేపథ్యంలో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపు జెన్-జెడ్ ఉద్యమకారులు మొగ్గుచూపినట్లు- తెలుస్తోంది. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అవినీతికి వ్యతిరేకంగా నేపాల్లో కొనసాగుతున్న ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జనరేషన్-జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 5వేల మంది బుధవారం వర్చువల్గా సమావేశమై మంతనాలు జరిపారు. కాఠ్మాండూ మేయర్ బాలెన్ షాను తొలుత పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఆయన నుంచి స్పందన రాలేదని తెలిసింది. దీంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపు ’జెన్-జెడ్’ ప్రతినిధులు మొగ్గుచూపినట్లు- నేపాల్ డియా వెల్లడించింది. బాధ్యతలు స్వీకరించేందుకు కర్కీ సిద్ధమైతే.. తొలుత ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్తో భేటీ- కావాల్సి ఉంటు-ంది. ఆ తర్వాత అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ ఆమోదం పొందాల్సి ఉంటు-ందని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సుశీలా కర్కీ (72)కి నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. తొలుత ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత న్యాయవ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి.. శాశ్వత న్యాయమూర్తిగా నియమితుల య్యారు. 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టి.. నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. నేపాల్లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు ముగ్గురు పోలీసులు సహా 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 633 మంది గాయాలపాలైనట్లు- తెలిపారు. ఆందోళనల్లో గాయపడిన నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.