నల్గొండ ఎప్పటికీ కాంగ్రెస్‌ అడ్డానే

కార్యకర్తలే కాంగ్రెస్‌ ‌పార్టీకి బలం:  మంత్రి  కోమటి రెడ్డి 
నల్లగొండ, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23:‌బీఆర్‌ఎస్‌  ‌పార్టీ నాలుగు ముక్కలయ్యిందని..అది మునిగిపోయే నావ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు.  నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన..నల్గొండ జిల్లాలో  ఓ నాయకుడు ఉన్నాడు.. ఎప్పుడూ గెలిచిన రెండు వేల లోపు మెజార్టీనే ఇక మళ్ళీ గెలవడని జగదీష్‌ ‌రెడ్డిని ఉద్దేశించి సెటైర్‌ ‌వేశారు. నల్గొండ గడ్డ కాంగ్రెస్‌ ‌పార్టీకి అడ్డా అని కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు.. కాంగ్రెస్‌ ‌కండువా మోసే నిఖార్సైన కార్యకర్తలే పార్టీకి బలం అని చెప్పారు.30 ఏళ్లుగా తనను అక్కున చేరుకున్న కార్యకర్తలకు  ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేనన్నారు.  ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చే బాధ్యత కార్యకర్తలదేనని చెప్పారు.   గ్రాణ రోడ్లు అన్ని డబుల్‌ ‌రోడ్లుగా మారుస్తా .. విద్యా,వైద్యంలో ఇంకా మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు.  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా వంద శాతం కాంగ్రెస్‌ ‌పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *