– ఆ గ్రామాల్లో సర్వే మ్యాప్, భూధార్ అమలుకు యోచన
– రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 23: దశాబ్దాలుగా రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలకు గాను ఐదు గ్రామాలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన రీసర్వేను విజయవంతంగా పూర్తిచేశామని, వీలైనంత త్వరగా ఆ ఐదింటిలో సర్వే బౌండరీస్ యాక్ట్ ప్రకారం నక్షా మ్యాప్నకు తుదిరూపునిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడిరచారు. సచివాలయంలోని తన చాంబర్లో రీసర్వేపై ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి వి.లోకేష్ కుమార్, సర్వే ల్యాండ్ సెటిల్మెంట్ కార్యదర్శి రాజీవ్గాంధీ హనుమంతుతో కలిసి బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజాం కాలం నుంచి 413 గ్రామాలకు నక్షాలు లేవని, గత ప్రభుత్వం పదేళ్లలో ఈ గ్రామాలను గాలికి వదిలేసిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ప్రయోగాత్మకంగా మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్తది), ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహిద్నగర్ గ్రామాల్లో డ్రోన్/ఏరియల్, ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ రోవర్ పద్దతుల్లో సర్వే నిర్వహించామని తెలిపారు. నిబంధనల ప్రకారం భూ యజమానులకు నోటీసుల జారీతోపాటు గ్రామ సభలు నిర్వహించి యజమానుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి ఒక్కరి భూములకు సర్వే హద్దులను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడిరచారు. ఈ ఐదు గ్రామాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల మనోభావాలు, ఆలోచనలకనుగుణంగా వారు సంతృప్తి చెందేవిధంగా నక్షా మ్యాప్ ఉండాలని స్పష్టం చేశారు. భూములు అమ్మకం, కొనుగోలు సందర్భంలో హద్దులతో కూడిన సర్వే మ్యాప్ను ఖచ్చితంగా జతపరచాలని, అలాగే దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో భూములకు కూడా భూదార్ నెంబర్ కేటాయించాలని భూభారతి చట్టంలో స్పష్టం చేసినట్లు, ఈ ఐదు గ్రామాలలో ఈ రెండు అంశాలను అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ ఐదు గ్రామాలలో ఐదు గుంటలకుపైగా ఉన్న భూములకు కొత్తగా సర్వే నెంబర్లు ఇవ్వాలని, అలాగే రెవెన్యూ, ఫారెస్ట్, దేవాదాయ, వక్ప్ భూములు ఉంటే వాటి వివరాలను కూడా రికార్డులలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సర్వే ల్యాండ్ సెటిల్మెంట్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి, ఐదు గ్రామాలకు చెందిన ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వే ల్యాండ్ సెటిల్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు, సర్వే నిర్వహించిన ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.





