హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 10: పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ మెట్రో రైలులో ఆదివారం సాయంత్రం ప్రయాణించారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్బీ స్టేషన్ వరకు ప్రయాణించారు. ఆయన తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రత్యేకంగా చిన్నారులతో మాట్లాడారు. మంత్రితో ాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కూడా మెట్రోలో ప్రయాణించారు.
మెట్రోలో ప్రయాణించిన మంత్రి జూపల్లి



