హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లాతో కలిసి లోక్ భవన్ కమ్యూనిటీ హాల్ (సంస్కృతి)లో లోక్ భవన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అక్కడి అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని రథయాత్రను ప్రారంభించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





