కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధానిలో దక్షిణ కోల్కతా కస్బా ఏరియాలోని లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన సంచలనమైంది. దీంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలలో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 25వ తేదీ రాత్రి 7.30-8.50 గంటల మధ్య కస్బా లా కాలేజీ క్యాంపస్లో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. దీనిపై బాధిత విద్యార్థిని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణను ప్రారంభించిన పోలీసులు మరింత సమాచారం కోసం కాలేజీ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వివిధ వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోల్కతాలో లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం




