కిట్స్ లో డీఎస్టీ న్యూదిల్లీ, మాజీ శాస్త్రవేత్త డాక్టర్ టివి వెంకటేశ్వరన్
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: ఎల్లోరా గుహలు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అద్భుతమైన రాతితో చేసిన దేవాలయాలు, మఠాలు వంటి వాస్తవ ఉదాహరణలు భారతదేశ చరిత్ర, కళ మతసామరస్యాన్ని చూపుతాయని డీఎస్టీ న్యూదిల్లీ, మాజీ శాస్త్రవేత్త డాక్టర్ టి.వి. వెంకటేశ్వరన్ అన్నారు. మంగళవారం కిట్స్ (KITS ) కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగం (సి ఎస్ ఎం-ఏఐ అండ్ ఎంఎల్) “4వ పారిశ్రామిక విప్లవంలో ఇంజనీరింగ్ విద్య” అనే అంశంపై విజిటింగ్ ప్రొఫెసర్ ఐఐఎస్ ఈర్ మొహాలి సహకారంతో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1800 – 2000 నుండి ఈ సంవత్సరం పరిశ్రమ స్థాయిలో విప్లవం ఎలా సృష్టించబడిందనే దానిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఆటోమేషన్ రంగంలో సాంకేతిక పురోగతి ప్రపంచాన్ని అపూర్వమైన స్థాయిలో భౌతిక సంపద, వనరులతో నడిపించే భవిష్యత్తును వివరించే “ఏజ్ ఆఫ్ అబండన్స్” భావనను కూడా ఆయన హైలైట్ చేశారు. ఈ సాంకేతికతలు వస్తువులు, సేవలను ఉత్పత్తి చేసే ఖర్చును నాటకీయంగా తగ్గించగలవు, వాటిని దాదాపు అందరికీ అందుబాటులో ఉంచగలవు, శాస్త్రవేత్తల స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.
డీన్ అకడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె. వేణుమాధవ్ మాట్లాడుతూ.. పరిశ్రమ సిద్ధంగా ఉన్నవారికి నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ సెమినార్ లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో పాటు, సిఎస్ఎం విభాగం విద్యార్థి సమాజంలో ఆవిష్కరణ సంస్కృతి, విప్లవాన్ని క్రమపద్ధతిలో పెంపొందించడానికి వివిధ వర్క్షాప్లు, సెమినార్లను నిర్వహిస్తున్నామన్నారు. కిట్స్ లో 4వ పారిశ్రామిక విప్లవంలో ఇంజనీరింగ్ విద్య పై నిర్వహించిన ఈ సెమినార్ విజయవంతమైందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా రాజ్య సభ మాజీ ఎంపీ, కిట్స్డబ్ల్యు (KITS W) చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంతా రావు, కిట్స్డబ్ల్యు కోశాధికారి పి. నారాయణరెడ్డి , హుస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే, కిట్స్ అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్ 4వ పారిశ్రామిక విప్లవంలో ఇంజనీరింగ్ విద్యపై అతిథి ఉపన్యాసం నిర్వహించినందుకు సి ఎస్ఎం ఇంజనీరింగ్ విభాగం విభాగాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, వివిధ విభాగాల డీన్స్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, సిఎస్ఎం విభాగాధిపతి, ప్రొఫెసర్ ఎస్. నరసింహ రెడ్డి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్: ఐ సాయి రామకృష్ణ, సిఎస్ఎం అసోసియేషన్ ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్లు; బి. రామ్జీ, డాక్టర్ కె. శివకుమార్, స్టూడెంట్ కోఆర్డినేటర్లు: ఎం. శ్రీజని, జి. జ్ఞానదీప్, అసోసియేట్ ప్రొఫెసర్, పిఆర్ఓ, డా. డి.ప్రభాకరా చారి, 350 మందివిద్యార్థులు,బోధన, బోధనేతర సిబ్బంది హాజరయ్యారు.





