– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కల్వకంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంతీయ ఆస్థిత్వం కోసం శిబూసోరెన్ చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని కొనియాడారు. ాయన మరణం దేశ అస్థిత్వ, జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటని అన్నారు. ఈ మేరకు కేసీఆర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.





