దిల్లీ, ప్రజాతంత్ర, జులై 7: దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కలుసుకున్నారు. హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం, కపిల్దేవ్ మధ్య చర్చలు జరిగాయి. అలాగే ప్రముఖ హిందీ సినీ నటుడు అజయ్ దేవగణ్ కూడా సీఎంను కలుసుకున్నారు. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఆయన ఆసక్తి కనబరిచారు. ఏఐ సాంకేతికత జోడిరపుతో వీఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోల ఏర్పాటుకు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేశారు.
రేవంత్ను కలిసిన కపిల్దేవ్, అజయ్దేవ్గన్



