ముఖ్యమంత్రికి ’కాళేశ్వరం’ నివేదిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలుపై పీసీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అధికారులు అందించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్‌ పాటిల్‌, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కమిషన్‌ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా నియమిస్తూ ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఈ నెల 4న నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని రాష్ట్ర కేబినెట్‌కు సమర్పించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *