– దర్యాప్తు చట్టబద్దతపై సవాల్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూదిల్లీ, జనవరి 16: నోట్ల కట్టల కేసులో న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనను తొలగించాలని కోరుతూ వచ్చిన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఆమోదించడంతోపాటు తనపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానల్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును జనవరి 8న రిజర్వ్ చేసిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్సీ శర్మలతో కూడిన ధర్మాసనం శుక్రవారం వెలువరించింది. గతేడాది జస్టిస్ యశ్వంత్వర్మ దిల్లీ హైకోర్టులో సేవలందిస్తున్నప్పుడు తన అధికారిక నివాసంలో పెద్దఎత్తున నోట్లకట్టలు లభ్యమయ్యాయి. దానిపై అంతర్గత త్రిసభ్య సంఘం విచారణ జరిపింది. అది ఇచ్చిన నివేదిక నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. ఆయన దానికి అంగీకరించకపోవడంతో పార్లమెంటులో అభిశంసనకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్ వర్మకు అక్కడా చుక్కెదురైంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




