‌ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌ప్రమాణం

– ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
– హాజరైన పలు దేశాల న్యాయమూర్తులు

న్యూదిల్లీ, నవంబరు 24:  భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సూర్యకాంత్‌  ‌ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆదివారంనాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్‌ ‌గవాయ్‌ ‌స్థానంలో జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వాసిగా జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌రికార్డు సృష్టించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తొలిసారిగా భూటాన్‌, ‌కెన్యా, మలేసియా, మారిషస్‌, ‌నేపాల్‌, శ్రీ‌లంక దేశాల చీఫ్‌ ‌జస్టిస్‌లు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావడం విశేషం. జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ 1962 ‌ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ ‌యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్‌, ‌హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018లో హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. వివిధ ధర్మాసనాల్లో పలు కీలక తీర్పుల్లో ఆయన భాగమయ్యారు. 370వ అధికరణను రద్దు చేస్తూ చారిత్రక తీర్పు ఇచ్చిన ధర్మసనంలో ఉన్నారు. బిహార్‌ ఎన్నికల జాబితా రివిజన్‌, ‌పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌తీర్పులు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, మాజీ సీజేఐ జస్టిస్‌ ‌గవాయ్‌, ‌కేంద్ర మంత్రులు, ఇతరులు పాల్గొన్నారు.

అధికారిక వాహనం వొదిలిన గవాయ్‌

సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం మాజీ సీజేఐ జస్టిస్‌ ‌గవాయ్‌ ‌తాను వొచ్చిన అధికారిక కారును కొత్త సీజేఐ జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌కోసం రాష్ట్రపతి భవన్‌ ‌వద్ద వొదిలివెళ్లినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. నిబంధనల ప్రకారం సీజేఐగా పదవీ విరమణ చేసిన అనంతరం మాజీ సీజేఐలు తాము ఉంటున్న అధికారిక నివాసాలను, ప్రభుత్వం ఇచ్చే ఇతర సౌకర్యాలను వీడాల్సి ఉంటుంది. అందులో భాగంగానే జస్టిస్‌ ‌గవాయ్‌ ‌కారును సీజేఐ జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌కోసం వొదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే 14న 52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ ‌గవాయ్‌ ‌పదవీకాలం ముగిసిన విష‌యం విదిత‌మే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *