హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ ఈఓ వెంకట్రావు, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. సిఎంను ఆయన నివాసంలో కలిసిన వీరు స్వామి ప్రసాదాలను అందించి, వైకుంఠ ఏకాదశి దర్శనానికి ఆహ్వానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.