హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: భారత్, రష్యా దేశాల మధ్య దశాబ్దాలుగా స్నేహబంధం కొనసాగుతున్నదని, తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేం దుకు రష్యా బృందం ఆసక్తి చూపడాన్ని తెలం గాణ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, ఆసక్తిని కన బరుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సాయంత్రం ప్రజా భవన్లో ఆయన గ్లోబల్ ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (జీటీటీసీఐ), వీటీబీ రష్యన్ బ్యాంక్ ప్రతినిధులతో చర్చించారు. వ్యవసా యం, విద్యుత్తు, టెక్నాలజీ రంగాల్లో దేశం లోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రా ష్టం ముందంజలో ఉందని డిప్యూటీ సీఎం ర ష్యా ప్రతినిధి బృందానికి వివరించారు. ఒక సీజన్ లో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ రా ష్ట్రం ముందంజలో వుందన్నారు. ఫార్మా, ఐటీ రంగాలకు హబ్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిన విషయాన్ని లెక్కలతో డిప్యూటీ సీఎం వివరిం చారు. మైనింగ్ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని 100 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన ప్రభుత్వ
రంగ సంస్థ సింగరేణి, 45 వేల మంది ఉద్యోగులతో కొనసాగుతున్న విషయాన్ని వివరించారు. సింగరేణి సంస్థ విస్తరణ లో భాగంగా క్రిటికల్ మినరల్ మైనింగ్ దిశగా ముందుకు పోతున్న విషయాన్ని తెలిపారు. డిఫెన్స్ రంగంలోనూ హైదరాబాద్ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. 1940 నుంచి
ప్రభుత్వ రంగ సంస్థలకు హైదరాబాద్ కేంద్రం కొనసాగుతుందని, వ్యూహత్మకంగా హైదరాబాద్ సురక్షిత ప్రాంతమని తెలిపారు. దృఢమైన సహకార బ్యాంకు వ్యవస్థలో టెక్నాలజీ, పెట్టుబడులకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. మా శాఖల అధికారులతో కూర్చుని చర్చించి మెరుగైన ఒప్పందాలు జరిగేలా ముందుకువెళ్లాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని వివరించారు. 2047 విజన్ డాక్యుమెంట్, మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యసాధన, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మూసి పునర్జీవం వంటి ప్రణాళికలను రష్యాబృందానికి డిప్యూటీ సీఎం వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ంత్ రెడ్డి రష్యా బృందానికి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరినట్లు
డిప్యూటీ సీఎం తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





