కార్బైడ్‌ ‌మామిడి పండ్లను గుర్తించండి

– పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జానార్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌మామిడి పండ్ల సీజన్‌ ‌ప్రారంభం అయ్యింది. నగరంలో నోరూరించే పండ్లు క‌నిపిస్తున్నాయి. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు  మామిడిని అక్ర‌మ ప‌ద్ధ‌తుల్లో మాగ‌బెట్టి విక్రయాలకు పాల్పడటం ఆందోళనకు గురిచేసే విషయం. మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్‌ ‌రసాయనాలతో కృత్రిమంగా పండించి విక్రయిస్తున్న వ్యాపారుల పట్ల జాగ్రత్త అవసరం. ఇలాంటి పండ్ల వల్ల ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా క్యాన్సర్‌ ‌ముప్పూ పొంచి ఉందంటున్నారు నిపుణులు. ఈ విషయమై హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీ.సీ.సజ్జానార్‌ ఎక్స్ ‌వేదికగా స్పందించారు. వేసవి కాలం రావ‌డంతో మామిడి మార్కెట్‌లో సందడి చేస్తోందని అన్నారు. అయితే.. నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషకోరలు దాగున్నాయన్న నిజాన్ని ప్రజల మరవకూడదని హెచ్చరిస్తూ ’కల్తీ మామిడి పండ్లతో తస్మాత్‌ ‌జాగ్రత్త!’ అని ఎక్స్ ‌వేదికగా వివరించారు. మార్కెట్లలో ఎక్కడైనా కల్తీ మామిడి పండ్లను విక్రయించినా, ఆ సమాచారం తెలిసినా వెంటనే డయల్‌ 100‌కి గానీ, హెచ్‌-‌ఫాస్ట్ ‌ఫోన్‌ ‌నంబర్‌ 8712661212‌కు కాల్‌ ‌చేయాలని సజ్జనార్‌ ‌సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *