– ప్రభుత్వ తీరుపై మండిపడ్డ తలసాని
– దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చాలని డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి
ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం బీఆర్ఎస్ హయాంలో 150 డివిజన్లు చేశామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహానగరాన్ని ఇష్టమొచ్చినట్లు విభజిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ పనుల కోసం ప్రజలు నగరం మొత్తం తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారని తెలిపారు. దీనిపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతామని తెలిపారు.అసెంబ్లీలో కూడా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎంతోమంది ముఖ్య మంత్రులను, స్పీకర్లను చూశాం.. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి, స్పీకర్ను చూడలేదని అన్నారు. స్పీకర్ కనీసం ప్రతిపక్ష సభ్యుల వైపు చూడటం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడడం ప్రతిపక్ష పార్టీ పని అని.. కానీ ప్రతిపక్ష పార్టీని స్పీకర్ నిలువరిస్తున్నారని అన్నారు. గంటన్నర పాటు రేవంత్ రెడ్డి బూతు పురాణం మాట్లాడుతున్న స్పీకర్ అడ్డు చెప్పలేదని మండిపడ్డారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతనలేదని విమర్శించారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెబుతూనే అభిప్రాయం చెప్పకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



