– తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 30: ఇద్దరు యువకులు వేధించడం, అవమానించడం తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అనితను తొర్రూరు మండలానికి చెందిన దూరపు బంధువు రాజేందర్ పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. ఇటీవల ఆమె డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయమని చెప్పడం, ఎవరితోనో మాట్లాడుతున్నావంటూ ఆమెను రాజేందర్ వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేక అనిత తన తల్లిదండ్రులతో చెప్పి బాధపడింది. రాజేందర్ పద్ధతి నచ్చక తమ కూతురుని అతడికి ఇచ్చి పెళ్లి చేయడం కుదరదని తేల్చి చెప్పారు. అయినా అనితను పెళ్లి చేసుకుంటానంటూ బతిమలాడుతూనే ఉన్నాడు. మరోవైపు అనిత తన క్లాస్మేట్ అయిన జబ్బార్ లాల్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని భావించారు. ఇటీవల జబ్బార్ కూడా మోసగాడని తేలింది. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని పదేపదే వేధించడం మొదలుపెట్టాడు. జబ్బార్ వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన అనిత ఈ నెల 27న రాజేందర్కు ఫోన్ చేసి ’నువ్వు, జబ్బార్ నా జీవితంతో ఆడుకున్నారు,..నన్ను వేధించారు.. అవమానించారు.. విÖ వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ తెలిపింది. అనితకు ధైర్యం చెప్పాల్సిన రాజేందర్ నిర్లక్ష్యంగా ’చావు.. నీ ఇష్టం’ అంటూ ఫోన్ కట్ చేశాడు. దాంతో అనిత తీవ్ర మనస్తాపానికి గురై గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్కు తరలించగా చికిత్సపొందుతూ అనిత కన్నుమూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాజేందర్, జబ్బార్లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





