హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్కు శుక్రవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. జస్టిస్ గవాయ్తోపాటు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పగిడిగంటం శ్రీనర్సింహలకు రాష్ట్ర హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్పాల్తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు, డీజీపీ డాక్టర్ జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సైబరాబాద్ సి.పి. మొహంతి, ఏజీ సుదర్శన్ రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వ్వాగతం పలికారు.
సీజేఐ గవాయ్కు ఘన స్వాగతం




