– దళితులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘా ఒకే వేదికపైకి రావాలి
– ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ సంతాప సభను రాష్ట్ర గౌరవానికి తగ్గట్టు, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా నిర్వహించాలి అని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. తన నివాసంలో కవులు, కళాకారులు, దళిత సంఘాలు, ప్రజా సంస్థలు, ఉద్యోగ సంఘాలతో కలిసి ఆయన సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దళితుల పక్షాన నిలిచిన నాయకుడని, ఎస్సీ వర్గీకరణ నిర్ణయం నుంచి కళాకారులకు అధిక గౌరవం దక్కేలా తీసుకున్న చర్యల వరకూ దళిత-బహుజన వర్గాల పక్షాన నిలిచారని గుర్తు చేశారు. దళిత ఐక్యత సందేశంగా అందెశ్రీ సంతాప సభను విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ సభ విజయవంతానికి దళిత సమాజం ఒకే తాటిపైకి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. కవులు-కళాకారులకు ఇంత గౌరవం ఇచ్చిన సీఎం ఇప్పటివరకు లేరంటూ అందెశ్రీ అంత్యక్రియల్లో సీఎం స్వయంగా పాల్గొనడం కళాకారుల పట్ల ప్రభుత్వం చూపుతున్న గౌరవానికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. రాష్ట్ర గీతమే కాదు.. తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ గౌరవం అందెశ్రీ రచనల్లో ఉంది.. ఆయన రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు అని మంత్రి అన్నారు. సంతాప సభను సాంస్కృతిక-సామాజిక ఘట్టంగా, ప్రజలు, కవులు, కళాకారులు, విద్యార్థులు, సంఘాలు అందరూ పాల్గొనే వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. అందెశ్రీ సేవలను ప్రతిబింబించే కవి సమ్మేళనం.. సాంస్కృతిక నివాళులు.. జానపద-ప్రజా కళారూపాల కార్యక్రమాలు. అన్ని సంఘాలతో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు, దళిత ఐక్యత-తెలంగాణ స్ఫూర్తి-కళాకారుల గౌరవం అనే ప్రధాన థీమ్స్ చుట్టూ సభ రూపకల్పన
రూపకల్పన జరిగింది. సమావేశంలో ప్రొఫెసర్ కాశీం (ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్), ప్రొఫెసర్ విద్యాసాగర్ (వ్యవసాయ విశ్వవిద్యాలయం), టీఎంఆర్పీఎస్ నేతలు మేడి పాపయ్య, ఇటుక రాజు, రమేష్, సతీష్ మాదిగ,జెన్కో మేడి రమేష్, సంగీతం రాజలింగం, అరెపల్లి రాజేందర్, మోహన్, చింతా బాబు, మంచాల యాదగిరి, గంట సుదర్శన్,అందె రుక్కమ్మ, ముంజగాల విజయ్ కుమార్, మల్లెపోగు శ్రీనివాస్, జీడి నరసింహ, ఐఎన్టీయూసీ నేత శివ, భీమ్, రవికిరణ్, శివ, లాజర్, సుగుణమ్మ, యోసేపు, యాదగిరి, శంకర్, ఓయూ రీసెర్చ్ స్కాలర్ పాల్వాయి నాగేష్ తదితరులు సూచనలు అందించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకుల సూచనల మేరకు సభ కార్యాచరణ ప్రణాళికను మంత్రి ఆమోదించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





