పంచాయతీల్లోని మల్టీపర్పస్‌ వర్కర్లకు శుభవార్త

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 53 వేల మంది మల్టీ పర్పస్‌ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వారికి ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి మొత్తం రూ.150 కోట్లు వేతనాలుగా ఆర్థిక శాఖ విడుదల చేసింది. గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఆ నగదు మంగళవారమే జమ కానున్నది. కాగా, ఒకటి రెండు రోజుల్లో మల్టీపర్పస్‌ వర్కర్లు తమ మూడు నెలల జీతాలను అందుకోను న్నారు. ప్రభుత్వ నిర్ణయం వారందరికీ ఊరట కలిగించే అంశమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *