ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు ఆహ్వానం
డిసెంబర్ 8, 9 రాష్ట్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన రోజులు
2047 డాక్యుమెంట్ ను ప్రపంచానికి వివరిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డిసెంబర్ 8, 9 రాష్ట్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన రోజులుగా ప్రభుత్వం భావిస్తుంది అని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంటును ప్రపంచానికి చూపిస్తాం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక పరిశీలనలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీని సందర్శించి మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాం మొదటి సంవత్సరం సాధించిన విజయాలను రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పాం ఈ రెండవ సంవత్సరం సాధించిన విజయాలతో పాటు 2047 డాక్యుమెంట్ ను ప్రపంచానికి వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ కేబినెట్ ప్రత్యేక నిర్ణయం తీసుకుందన్నారు. 2047 వరకు తెలంగాణ ఏ రకం ఉండబోతుంది, ఏ రకంగా ఉండాలి. ప్రపంచంతో పోటీపడే విధంగా 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించిన విషయాలను ప్రజా ప్రభుత్వం వివరించదలుచుకుంది. ఈ విజయాలను వివరిస్తూ భవిష్యత్తును చాటి చెప్పేందుకు నగరానికి నలు దిక్కులా అవసరమైన వేదికలను పరిశీలిస్తున్నామనీ 100 ఎకరాల ఓపెన్ ప్లేస్ అవసరం అవుతుంది భారత్ ఫీచర్ సిటీ, హైటెక్స్, గచ్చిబౌలి స్టేడియం, దుండిగల్ తదితర ప్రాంతాలను వేదికల కోసం పరిశీలిస్తున్నాం అన్నారు. “ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆహ్వానించి ఇటీవల దుబాయ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆ ఫెస్టివల్ ను మించి గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం. గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం. హైదరాబాదు పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతం. అద్భుతమైన వాతావరణం, తక్కువ ధరలకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉంటాయి అని గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా తరలివస్తున్న పారిశ్రామికవేత్తలకు వివరించనున్నాం ..” అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విలేకరుల సమావేశంలో ఉన్నతాధికారులు జయేష్ రంజన్, సందీప్ కుమార్ సుల్తానియా, వికాస్ రాజ్, శశాంక, కృష్ణ భాస్కర్, ముషారఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.





