హోటల్‌ మేనేజిమెంట్‌ అకాడవిూలో మత్తు

– గంజా సేవించిన ఆరుగురు విద్యార్థుల అరెస్ట్‌

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 8: డ్రగ్స్‌ మత్తులో యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నాయి. డ్రగ్స్‌ ను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా హైదరాబాద్‌ లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపింది. బేగంపేట్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అకాడవిూలో డ్రగ్స్‌ కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు విద్యార్థులు గంజా సేవించినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు మంది విద్యార్థులకు డ్రగ్‌ టెస్టు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. ఈగల్‌, నార్కోటిక్స్‌ పోలీసులు సంయుక్తంగా విద్యార్ధులకు పరీక్షలు చేశారు. పట్టుబడిన వారు చివరి సంవత్సరం చదువుతున్న హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులుగా గుర్తించారు. వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చి డి`అడిక్షన్‌ సెంటర్‌కు తరిలించినట్లు తెలిపారు. విద్యార్థుల స్నేహితుడే డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *