ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి ముందు ఇంధనం నిలిపివేయబడిందని నివేదిక లో పేర్కొన్నట్లు సమాచారం.
ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 లో ఇంధన స్విచ్లపై దృష్టి కేంద్రీకరించడంతో, పైలట్ల చర్యలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
గత నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి శనివారం తెల్లవారుఝామున ఇండియా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిపివేయబడింది. ఈ సమాచారం విమానం వాయిస్ మరియు డేటా రికార్డర్ ఆధారంగా వెల్లడైంది.
ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించడంతో పైలట్ల చర్యలపై ప్రశ్నలు తలెత్తాయి. యంత్రాంగ విఫలమవడం లేదా రూపకల్పన లోపాల వల్ల ఈ ప్రమాదం జరగలేదని నివేదిక సూచిస్తోంది. విమానం తయారీ సంస్థ బోయింగ్, ఇంజిన్ తయారీ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్లకు “ఏ నియమిత చర్యలు అవసరం లేవు” అని పేర్కొంది.
“కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో ఒక పైలట్ మరొక పైలట్ను అడుగుతున్నాడు – ‘ఇంధనం ఎందుకు కట్ చేశావ్?’ అని. కాగా, ఇతర పైలట్ ‘నేను కట్ చేయలేదు’ అని సమాధానం ఇచ్చాడు” అని నివేదికలో పేర్కొన్నారు.
ఈ బోయింగ్ 787 డ్రీమ్లైనర్ జూన్ 12న అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే కుప్పకూలింది. విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరు తప్పా మిగతావారు అందరూ ప్రాణాలు కోల్పోయారు.





