ముఖ్యమంత్రితో ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ బృందం భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: ముఖ్యమంత్రి ఎ..రేవంత్‌ రెడ్డితో ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ మార్క్‌ లామీ బృందం శ‌నివారం మర్యాద పూర్వకంగా భేటీ అయింది. హైదరాబాద్‌లో ఫ్రాన్స్‌ ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చ జరిగింది. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్‌ బృందాన్ని సీఎం కోరారు. హైదరాబాద్‌లో ఫ్రెంచ్‌ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని కూడా కోరారు. ఈ సమావేశంలో మౌద్‌ మిక్వా, స్పెషల్‌ సీఎస్‌ జయేష్‌ రంజన్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి, అజిత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *