మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: జిల్లాలోని రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం గుడ్డు కూర తిన్నారు. అయితే అదే గుడ్డు కూరను రాత్రికి పులుసుగా తయారుచేసి విద్యార్థులకు వడ్డించినట్లు తెలుస్తోంది. తద్వారా 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం పది విద్యార్థులు తిరిగి కోలుకున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




