శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ఉధృతి

శ్రీశైలం, ప్రజాతంత్ర, జులై 2: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. జూరాల నుంచి శ్రీశైలానికి 83.224 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. అదే విధంగా జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం ప్రస్తుత నీటిమట్టం 875.2 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 164.7 టీఎంసీలు ఉన్నాయి. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్‌ ఉత్తత్తి చేసి35,315 క్యూసెక్కులు దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *