శ్రీ పరాభవ నామ సంవత్సర పండగలు ఖరారు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 15 : రాబోయే పరాభవ నామ సంవత్సరం (2026-2027)లో వచ్చే పండగల జాబితాను తెలంగాణ విద్వత్సభ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు మంగళవారం అందచేసింది. పండగల విషయాల్లో ఏవిధమైన సంశయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకు గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో సిద్దాంతులందరూ ప్రతి సంవత్సరం చర్చించి పండగల తేదీలను నిర్ణయించి ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. ఇదేవిధంగా రాబోయే పరాభవ నామ సంవత్సర పండగలను దాదాపు వందమంది సిద్ధాంతులు పుష్పగిరి జగద్గురు సంస్థానంలో ఈనెల 13న నిర్వహించిన విద్వత్సభ సమావేశంలో ఖరారు చేశారు. ఈ జాబితాను విద్వత్సభ కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి ఆధ్వర్యంలో కోశాదికారి ఎం. వెంకటరమణ శర్మ, సంయుక్త కార్యదర్శి కమలాకర శర్మ, సమన్వయకర్త భీంసేన్‌ మూర్తి, బ్రాహ్మణ్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌ చైర్మన్‌ విజయ్‌ ఒద్దిరాజులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *