డిప్యూటీ సీఎంకు ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్‌ రీయంబర్స్మెంట్‌ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్లకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్‌లో జేఏసీ నేతలు డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. రోజుల వ్యవధిలోనే డీఏ జీవో విడుదల చేయడం, మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రణాళిక శాఖలో క్యాడర్‌ స్ట్రెంత్‌ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం, ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం, ప్రమోషన్లకు సంబంధించి వివిధ శాఖల్లో డీపీసీ కమిటీలు వేగంగా పనిచేయడంపై ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు, %jaష% వైస్‌ చైర్మన్‌ దేవరకొండ సైదులు,నాయకులు చావా రవి, సదానంద గౌడ్‌, సైదులు, ముజీబ్‌, కస్తూరి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *