విజయవాడ హైవేలో ఎలివేటెడ్‌ ‌కారిడార్‌

– అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధికా ప్రాధాన్యం ఇస్తోందని ఎల్బీనగర్‌ ‌నుంచి హయత్‌నగర్‌ ‌వరకు ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళికలో చేర్చిన తర్వాత డీపీఆర్‌ ‌తయారు చేస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌-‌విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్‌ ‌నుంచి హయత్‌నగర్‌ ‌వరకు ట్రాఫిక్‌ ‌రద్దీగా ఉందని, రామోజీ ఫిల్మ్ ‌సిటీ దాటిన తర్వాత ఫుట్‌ఓవర్‌ ‌బ్రిడ్జిలు కావాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో.. ఎల్బీనగర్‌ ‌నుంచి హయత్‌నగర్‌ ‌వరకు ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌నిర్మాణంపై నారాయణరెడ్డి ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్‌ ‌దాటిన తర్వాత పనామా వద్ద ఫ్లై ఓవర్‌ ‌మంజూరు చేయించినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌ ‌రద్దీని తగ్గించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. విజయవాడకు రెండు, మూడు గంటల్లో చేరే విధంగా.. డబుల్‌డెక్కర్‌ ‌రోడ్డును మంజూరు చేయించుకున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *