మహిళా రిజర్వేషన్లతో పునర్విభజన లింక్‌

– ఇం‌దులో బిజెపి రాజకీయ కుట్ర దాగి ఉంది
– పునర్విభజనను రాజకీయ పావుగా వాడుకుంటున్న ప్రధాని మోదీ
– జనాభా లెక్కల అనంతరం మహిళా బిల్లు అని చెప్పారు
– ఆ మేరకే గతంలో బిల్లు పెట్టి ఇప్పుడీ హడావిడి ఎందుకు?
– పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాలపై అనుమానాలు ఉన్నాయి
– 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి
– జనాభా లెక్కల తరవాత నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి
– దక్షిణాదిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఉత్తరాది సీట్ల పెంపు
– 50శాతం సీట్ల పెంపు ఏ ప్రాతిపదకనో ఎందుకు చెప్పడం లేదు
– మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌13: ‌మహిళా రిజర్వేషన్లు, పునర్విభజనను కలపడంతో రాజకీయ కుట్ర ఉందని సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. 2026 జనాభా లెక్కల ప్రకారం మహిళారిజర్వేషన్ల బిల్లు  తీసుకువస్తే కాంగ్రెస్‌ ‌పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతోపాటు కట్టుబడి ఉంటామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళల రాజకీయ సాధికారితకు కాంగ్రెస్‌ ‌మొదటి నుంచి కట్టుబడి ఉంది.. నియోజకవర్గాల పునర్వభజనను ప్రధాని మోదీ రాజకీయ పావుగా వాడుకుంటున్నాడని ఆరోపించారు. డీలిమిటేషన్‌, ‌మహిళా రిజర్వేషన్ల అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు ఆమోదం కోసమే పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. డీలిమిటేషన్‌ అనేది రాజకీయ పార్టీలకో, ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదని స్పష్టం చేసిన సీఎం రేవంత్‌ ..దీనిని మహిళా రిజర్వేషన్లతో కలిపి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని విమర్శించారు. సచివాలయంలో మంత్రులు, ఎంపిలు, ఇతర నాయకులతో కలసి సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ ‌కి వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు వోటు హక్కు, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్‌ ‌కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ‌హయాంలోనే మహిళలు ముఖ్యమైన పదవులు చేపట్టిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ ‌రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేసిన రేవంత్‌ ‌రెడ్డి.. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ రెండు అంశాలను అనుసంధానించడం వెనుక రాజకీయ కుట్ర, వివక్ష ఉన్నాయని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉందని ప్రకటించిన సీఎం రేవంత్‌, ‌ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌ ‌సీట్ల ఆధారంగానే ఈ బిల్లును అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ బిల్లును అమలు చేసి ఉంటే మరింత మంది మహిళలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యేవారని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోనే పురుషులతోపాటు మహిళలకు వోటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్‌ ‌పార్టీ అని అన్నారు. అప్పటికి ప్రపంచంలోని చాలా దేశాల్లో మహిళలకు వోటు హక్కు లేదని అన్నారు. దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా, లోక్‌ ‌సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా చాలా రాజ్యాంగబద్దమైన పదవుల్లో మహిళలకు కాంగ్రెస్‌ అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. మహిళల నాయకత్వంలో పనిచేసిన పార్టీ కాంగ్రెస్‌.. ‌రాజీవ్‌ ‌గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చారు.. సోనియా గాంధీ నాయకత్వంలో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు తీసుకువచ్చారు.. అప్పుడు రాజ్యసభలో ఆమోదించారు.. బీజేపీ సహకరించకపోవడం వల్లనే  లోక్‌ ‌సభలో బిల్లు ఆమోదం పొందలేదన్నారు. ఇంతకాలం ప్రధాని మోదీ ఈ బిల్లును పట్టించుకోలేదు. 2023 లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు కాంగ్రెస్‌ ‌సంపూర్ణ మద్దతుఇచ్చింది.. 2026 జనాభాలెక్కల తర్వాత గెజిట్‌ ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని చట్టం చేశారు.. 2026 జనభా లెక్కలు పూర్తి చేసి అమలు చేయకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా చట్టం ముందుకు తెస్తున్నారు.. 2026 జనాభా లెక్కల ప్రకారం నిబంధనను సవరించుకుంటే 2029 లోక్‌ ‌సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయోచ్చన్నారు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్‌ ‌చేయాలని ఎన్డీయే చూస్తోందన్నారు. కానీ, 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్‌, ‌మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్నది కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ అని చెప్పారు. ఈ రెండింటినీ కలపడం, పాత జనాభా లెక్కల ప్రకారం వెళ్లడంలో కుట్ర ఉందని ఆక్షేపించారు. 33శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ ‌సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ రిజర్వేషన్లను ఆర్నెల్లలోనే అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. డీలిమిటేషన్‌ ‌పక్రియ చాలా ప్రమాదకర దిశలో వెళ్తోంది. చిన్న రాష్ట్రాలు, దక్షిణాదికి అన్యాయం జరిగేలా మోదీ కుట్ర చేస్తున్నారు. కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్థంగా అమలు చేశాయి. ఉత్తరాదిలో అది సరిగ్గా అమలు కాకపోవడం వల్లే జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు వద్దని దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా చెప్పాయి. దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకత వల్ల మోదీ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రతి రాష్ట్రంలో 50శాతం సీట్లు పెంచుతామని చెబుతున్నారు. ఇలా చేస్తే యూపీ, బిహార్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌లలో సీట్లు బాగా పెరగనున్నాయి. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్లలో అంతరం భారీగా పెరుగుతుందన్నారు. సీట్ల పెంపు తర్వాత దక్షిణాదిలో 195 లోక్‌సభ స్థానాలు అవుతాయి. ఉత్తరాదిలో సీట్లు 620కి పెరుగుతాయి. ఉత్తర, దక్షిణాది మధ్య ప్రస్తుతం ఉన్న 210 సీట్ల అంతరం 412కి పెరుగుతుంది. ఎన్డీయే ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడం లేదు. కేంద్రంలోని కీలక శాఖలు ఏవీ దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. సీట్లు పెంచాలనుకుంటే అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడాలి. ఏ ప్రాతిపదికన 50 శాతం సీట్లు పెంచుతారు? సీట్లు 50 శాతం పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పాడు? 50శాతం సీట్లు పెంచితే ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరం ఏర్పడుతుంది. దక్షిణాదిపై చూపుతున్న వివక్షతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి.. పన్నులు కట్టడం, దిల్లీకి వెళ్లి సలాం కొట్టడం అన్నట్లుగా ఉంది. దీనికి మేం వ్యతిరేకం. దక్షిణాది రాష్టాల్రు దేశానికి ఫైనాన్షియల్‌ ‌కేపిటల్స్. ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్‌ ‌కేపిటల్స్. ‌పొలిటికల్‌ ‌కేపిటల్స్ ఎప్పు‌డూ ఫైనాన్షియల్‌ ‌కేపిటల్స్‌ని తక్కువగా చూస్తాయి. దక్షిణాది రాష్టాల్రు ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోతారని అన్నారు. హైబ్రిడ్‌ ‌ప్రాతిపదికన సీట్లు పెంచాలనేది మా డిమాండ్‌. ‌కొత్తగా పెంచే సీట్లలో 50 శాతానికి జీడీపీని ప్రాతిపదికగా తీసుకోవాలి. కొత్తగా పెంచే సీట్లలో 136 సీట్లు జీడీపీ వృద్ధి ఆధారంగా పెంచాలి. మరో 136 సీట్లను జనాభా ప్రాతిపదికగా పెంచాలి. దేశానికి ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలను గౌరవించాలి. చిన్న రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగేలా గతంలో సీట్ల కేటాయింపు జరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. సమావేశంల మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌, ‌కోమటిరెడ్డి, సీతక్క, పొంగులేటి, ఎంపిలు రఘురామిరెడ్డి, మల్లు రవి, సలహాదారు కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళలంటే బీజేపీకి చిన్న చూపు : రేవంత్‌ ‌రెడ్డి చురకలు

సీట్ల పునర్విభజనలో పర్సంటేజీలు కాదు నెంబర్‌ ‌ముఖ్యం అని సిఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో నెంబర్‌ ‌ముఖ్యం అంటూ వాజపేయి ప్రభుత్వం ఒక్క వోటుతో పడిపోయిందని గుర్తు చేశారు. నెంబర్‌ ‌లేకుండా రాజకీయాల్లో ఎవరూ ఎవరితోనూ చర్చలు చేయరని అన్నారు. ఇకపోతే ఇప్పటివరకు15 మంది బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగింది.. కాని ఇప్పటివరకు భారతీయజనతా పార్టీ అధ్యక్షురాలి గా ఒక్క మహిళ నియామకంజరగలేదని సిఎం రేవంత్‌ ‌చురకలంటించారు. బీజేపీకి మహిళ పట్లగౌరవం, చిత్తశుద్ది ఉందో అర్థమౌతుందన్నారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో అతి ఎక్కువ కాలం పనిచేసిన పార్టీ కాంగ్రెస్‌ ‌మహిళలకు అన్యాయం చేస్తుందా.. అని ప్రశ్నించారు. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్‌ ‌మాట్లాడాలన్నారు. బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలుదక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ,ఎస్టీ, మహిళలకు వ్యతిరేకం.. అన్నారు. మా ఎంపీలు తెలంగాణను సాధించారు.. ఇప్పుడు పునర్విభజన పైన కూడా పోరాడుతారని సిఎం అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం అని అన్నారు. పార్లమెంట్‌ ‌లో బిల్లును ఎలా ఆమోదిస్తారోచూస్తాం.. 60యేళ్లలోమహిళల కోసం కాంగ్రెస్‌ ‌పార్టీ చాలా చేసింది..46యేళ్లలో ఒక్క మహిళను పార్టీ  అధ్యక్షురాలిని బీజేపీచేయలేదు.. జనరల్‌ ‌సెక్రటరీ ఆర్గనైజేషన్‌ ‌పదవి కూడా ఇవ్వలేదన్నారు. మహిళలను చిన్న చూపు చూడటమే బీజేపీ లక్షణం.. ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళలను చూస్తున్నారు.. స్వాతంత్య్రం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్‌ ‌పార్టీ.. ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్‌ ‌దే అన్నారు. 50శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ‌లు  మోదీ ఇంటి ముందు బంట్రోతు లుగా నిలబడాల్సి వస్తుంది.. వాళ్ల అవసరం ఇక ముందు ఉండదన్నారు. అన్ని దక్షిణాది రాష్ట్రాలతోపాటు దిల్లీ, పంజాబ్‌ ‌లాంటి చిన్న రాష్ట్రాలకు కుదీనిపైన లేఖ రాస్తానని సిఎం రేవంత్‌ అన్నారు. గతంలోనియోజకవర్గాలపునర్విభజన మూడు సార్లు జరిగింది.. 1967 లో 52 0సీట్లకు పెంచారు,1976 లో 542సీట్లకుపెంచారు..తర్వాత సిక్కిం నుంచి ఒక సీటు పెరిగి 543 కి పెరిగింది.. 2001 లో వాజ్‌పేయి పునర్విభజన పైన చట్ట సవరణ చేశారు. దాని వల్ల 2009 లో తెలంగాణకు 17, ఆంధ్రాకు 25 ఎంపీ సీట్లు వచ్చాయి. తెలంగాణ కు 119, ఎపీకి 175 శాసన సభ సీట్లు పెరిగాయి.. స్థూల ఉత్పత్తిలో అత్యధికంగా భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలి.. ఈశాన్య రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనాభా ప్రాతిపాదికన సీట్లు లేవు.. 100 శాతం జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరగలేదు.. ప్రాతినిధ్యం కోసమే ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్లు ఇచ్చారని సిఎం గుర్తు చేశారు. సీట్ల పునర్విజభన పైన అఖిలపక్ష సమావేశంతోపాటు అన్ని సంస్థలతో సంప్రదింపులు చేయాలి.. పార్లమెంటులో పునర్విభజనపైన చర్చించాలి.. నిపుణలతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి.. అన్ని అసెంబ్లీల్లో చర్చకు పెట్టి పార్లమెంటులో ఆమోదించి నిర్ణయం తీసుకోవాలి.. 2028 మార్చి వరకు ఈ పక్రియను పూర్తి చేయోచ్చు.. హడావుడిగా చేసి దేశంలో దక్షిణ, ఉత్తరాది మధ్య గ్యాప్‌ ‌పెంచొద్దని సిఎం రేవంత్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *