– గడువు పొడిగించిన సీసీఐ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు రాష్ట్రంలోని రైతుల నుంచి పత్తి కొనుగోళ్లను ఈ నెలాఖరు వరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పొడిగించింది. కొనుగోళ్ల పొడిగింపుపై మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ కేంద్ర జౌళి శాఖ జాయింట్ సెక్రటరీకి శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలని ఇప్పటికే రాష్ట్రానికి చెందిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కూడా మంత్రి కోరారు. గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం, సీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల తుమ్మల నాగేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, పొడిగించిన గడువును వినియోగించుకుని పత్తిని అమ్ముకోవాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



