మూఢనమ్మకాలపై జాగృతం చేశారు

పట్టాభిరామ్‌ మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇంద్రజాల విద్య ద్వారా మూఢ నమ్మకాల నుంచి ప్రజలను జాగృతం చేయడంలో పట్టాభిరామ్‌ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. తన ఇంద్రజాల విద్య ద్వారా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేసిన పట్టాభిరామ్‌ లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *