నల్గొండ బీజేపీలో భగ్గుమన్న విభేదాలు

– సర్పంచ్‌లకు సన్మానం విషయంలో వివాదం
– పరస్పర దాడులకు తెగించిన ఇరు వర్గాలు

నల్గొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: ‌బీజేపీ నల్గొండ జిల్లా శాఖ‌లో విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో పార్టీ తరఫున గెలిచిన 17 మంది సర్పంచ్‌లకు సన్మానం చేసే విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో బీజేపీ నేత పిల్లి రామరాజుపై ఓ వర్గం దాడి చేసింది. దాంతో జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డిపై మరో వర్గం దాడికి పాల్పడింది. ఈ ఘర్షణ గురించి తెలిసి బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని కవర్‌ ‌చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్ల కెమెరాలను కొందరు నేతలు లాక్కుని డేటాను డిలీట్‌ ‌చేశారు. అందుకు నిరసనగా జర్నలిస్టులు బీజేపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు క్షమాపణ చెప్పడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *