దిల్లీలో ఫలించని బిజెపి మంత్రాంగం
దేశ వ్యాప్తంగా ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉండాలన్న లక్ష్యంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వొస్తున్న భారతీయ జనతాపార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ పక్కలో బల్లెంలా తయారైంది. దేశ రాజధాని దిల్లీపైన అధికారం ఎంత ముఖ్యమో, దిల్లీ మున్సిపల్పై పట్టుసాధించడం కూడా అంత ముఖ్యం. దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతాపార్టీకి తన ఛత్రఛాయలో ఉన్న దిల్లీ మున్సిపాలీటీపైనే…

