Category సాహిత్యం-శోభ

వాసిరెడ్డి స్మారక పురస్కారానికి గ్రంథాలకు ఆహ్వానం

ప్రొఫెసర్ వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారానికి సాహితి విమర్శ గ్రంధాలను ఆహ్వానిస్తున్నాం అరసం వరంగల్ కమిటీ ప్రతియేటా ఒక్కో సాహిత్య ప్రక్రియకు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తుంది.  2025 సంవత్సరానికి సాహిత్య విమర్శకు ప్రదానం చేయడానికి నిర్ణయించారు.  2021 జూలై నుండి 2025 జూన్ మధ్య ప్రచురించిన మెుదటి…

సుద్దపూసలు

యూట్యూబ్ వీడియో ప్లే అవుతోంది! “…బిస్కెట్ అనేది కాబ్స్ అండ్ షుగర్… సో పొద్దున్నే లేదా ఆకలేసినప్పుడల్లా తినకూడదు…” ‘నువ్వు బిస్కెటెయ్యకుండానే ఆ సీట్లో కూర్చున్నావా?’ కామెంటుకు లైకులే కాదు, లవ్వులూ విసిరారు! “సెకండ్, సాఫ్ట్ డ్రింక్స్ వద్దండి…” “బిర్యానీతో వొక్క కోక్ లాగిస్తే?” “ఒక్క చిన్న కోక్‌లో ఆల్మోస్ట్ సెవెన్ టు నైన్ స్పూన్స్…

పేదల బతుకు జ్వాల

“Strength does not come from physical capacity. It comes from an indomitable will” అంటారు గాంధీజీ. కొన్నిదశాబ్దాలుగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఎన్నో ఆటుపోట్ల సంద్రాలను ఎదురీదుతూ, దాని పునాదులపైనే వననివాసాన్ని నిర్మించుకొని, కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు  సమానత్వపు సమాజాన్ని సంకల్పిస్తూ, దానికై ఆలోచిస్తూ, దాన్నే అక్షరీకరిస్తూ, బతకడమంటే మామూలు విషయం…

ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు – 1

(అయిదు వారాల ధారావాహిక) 20వ శతాబ్దం – ఆధునిక సమాజంలో స్త్రీ పరమైన ఆలోచనలకు బలమైన వాదాన్ని వినిపించింది. స్త్రీ పురుషుల మధ్య సమానమైన ప్రతిపత్తిని ఆశించింది. అన్నిరంగాల్లో స్త్రీ ప్రతిభను విస్తరిస్తూ నూతన ప్రస్తానానికి శ్రీకారం చుట్టింది. అయితే సాంద్రమైన ఈ శతాబ్దంపై 16వ శతాబ్దం నుంచి కూడా ప్రభావ రేఖలున్నాయి. వీటన్నింటిని భారతీయ…

ఆధునిక భారతీయ రంగస్థలానికి మైలురాయి

ఖాదిర్ అలీ బైగ్ థియేటర్ ఫౌండేషన్, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న నాటకం‘1857: టుర్రెబాజ్ ఖాన్’ను ఈ శనివారం హైదరాబాద్‌లో ప్రదర్శించనుంది. ఎడిన్‌బరో ఫెస్టివల్ ఫ్రింజ్ లో ప్రపంచ ప్రీమియర్‌గా, లండన్‌లో యూకే ప్రీమియర్‌గా ప్రదర్శించి విశేషమైన ఆదరణ పొందిన ఈ నాటకం, హైదరాబాద్‌ వీక్షకులకు ప్రత్యేకంగా అందించబడుతోంది. ఈ నాటకం 1857 సిపాయీల తిరుగుబాటు కాలంలో…

మహిళా యుద్ధభాష అనిశెట్టి రజిత

కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారిణి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అయిన అనిశెట్టి రజిత 11 ఆగస్ట్‌ 2025న మరణించారు. ఆమెకి నివాళిగా ప్రజాతంత్ర సాహిత్య పేజీ ‘శోభ’  రాచపాళెం చంద్రశేఖరరెడ్డి రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురిస్తున్నది. అవమానిత స్త్రీ కురుల పాయనై ఇన్నాళ్ళ నా బ్రతుకులోని బేలతనాన్నిగాక నీలితనాన్ని బడబాలనంలా కుంభవృష్టించే నల్ల మబ్బునవుతా!…

ఎన్నెల మడుగు

అమ్మా మీవి భూదేవతసొంటి చేతులు కడపల్ల ఎవలడుగు పెట్టినా వాళ్ల కడుపిసారించి కంచంలో మెతుకైతరు ఇంటికెవలొచ్చినా గొంతు తడిపే సల్లటి నీటికుండైతరు తీరుబడి ముచ్చటకచ్చినోళ్లకి మీరు తీరొక్క పలారమైతరు బయటకెళ్ళి నున్నగున్న గుణపెంక ఇల్లుని జూసి ఇల్లు ముద్దుగుంది, మంచిగుందని పొగుడుతరు గానీ ఇంటి నిట్టాడ వల్లనే ఇల్లట్ల దీరగ నిలబడ్డదని మాట్లాడరు మీరు ఇంటి…

దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం  4

(2014-2023) (గత సంచిక తరువాయి భాగం) చందు తులసి రాసిన ‘‘నీళ్ళబిందె’’ (2018) కథ పట్టణాలలో వలసకూలీ జీవితం గడుపుతున్న లంబాడీ స్త్రీలు గుక్కెడు నీళ్ళకోసం ప్రతిరోజూ యుద్ధం చేయాల్సి వస్తున్న స్థితిని చిత్రించింది. ‘‘జీవితం నదిలా కాకున్నా కనీసం మురికికాలువలాగానైనా గడుస్తుందని ఆశపడి తండానుండి నగరానికి చేరుకుంటే అక్కడ తాగడానికి కూడా చుక్కనీళ్లు దొరకక…

పాలు-నీళ్ళు!

‘పాలల్లో నీళ్ళు బాగా కలిపేస్తున్నావ్?’ చికాకు పడుతూ అంది వో యిల్లాలు. ‘మా గేదెకూడా నీళ్ళు తాగుతుంది,’ చెప్పాడు పాలవాడు. ‘మరీ యెక్కువ నీళ్ళు తాగేస్తోంది,’ అంది యిల్లాలు. ‘ఎండాకాలం కదండీ?’ అన్నాడు పాలవాడు. ‘మీ గేదెకి గడ్డి వుంచట్లేదా?’ యిల్లాలు తగ్గలేదు. ‘అందరూ నానా గడ్డీ కరుస్తుంటే, పశువులకి గడ్డెక్కడ దొరుకుతుందీ?’ పాలవాడూ తగ్గలేదు.…