– ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్రెడ్డితో భేటీ
న్యూదిల్లీ, ఆగస్టు 25: ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బీసీ రిజర్వేషన్ల పెంపు మంత్రివర్గ ఉప సంఘం సోమవారం దిల్లీలో మర్యాద పూర్వకంగా కలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై ఆయనను మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు న్యాయ సలహా కోరారు. జస్టిస్ సుదర్శన్రెడ్డిని కలిసిన వారిలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ సీతక్క, శ్రీధర్బాబు కాంగ్రెస్ నేతలు ఈరవత్రి అనిల్, వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్సైట్ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





