యూరియా కొరతపై 20 రోజుల క్రితం మేము హెచ్చరించి అప్రమత్తం చేసినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పందించలేదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి రామారావు అన్నారు.. అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదనే నిర్ణయాన్ని 71 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరఫున తీసుకున్నాం అని పేర్కొంటూ నోటా ఉంటే దానికే వేసేవాళ్లం.. లేదు కాబట్టే ఎన్నికల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేసారు.
ఉపరాష్ట్ర పతి ఎన్నిక బహిష్కరిస్తున్నాం : బిఆర్ఎస్





