మంత్రి జూపల్లిని కలిసిన నటుడు గగన్‌ మాలిక్‌

\హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, జీటీవీ రామాయణంలో రాముడి పాత్రధారి, బుద్దిజం ప్రచారకుడు గగన్‌ మాలిక్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను బుద్ధవనం ప్రాజెక్ట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా మల్లేపల్లి లక్ష్మయ్య మంత్రి జూపల్లికి పరిచయం చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనానికి ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం కల్పించడం, వివిధ బౌద్ధ దేశాలను బుద్ధవనానికి రప్పించడం, వారి సాంస్కృతిక కార్యక్రమాలను బుద్ధవనంలో ఏర్పాటు చేయడంతోపాటు ఈ ఏడాది అక్టోబర్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బౌద్ధ భిక్షువులు సుమారు వందమందితో గుల్బర్గా మీదుగా బుద్ధవనానికి పాదయాత్రగా రావడం తదితర అంశాలను ఈ సందర్భంగా చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *