ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

– కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించండి
– జూబ్లీహిల్స్‌ ఓటర్లకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు మక్కన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, సీహెచ్‌.విజయ రమణ రావు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ‘రైజింగ్‌ తెలంగాణ’ కోసం భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించారు. ప్రతిపక్షాలు పనిగట్టుకొని కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే అజెండాగా పనిచేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి స్థానికంగా పాల్గొననున్న కార్నర్‌ మీటింగ్‌ ఏర్పాట్లపై స్థానిక నాయకులతో కలిసి సమీక్షించారు. పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలపై కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *