రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే బీజేపీలో చేరాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు సమక్షంలో మిర్యాలగూడకు చెందిన రాష్ట్ర ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు దైద రవి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరిన ప్రతి ఒక్కరికీ స్వాగతం.. ఇంకొన్ని రోజుల్లో మరింత పెద్ద ఎత్తున నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే బీజేపీలో చేరాలి అని పిలుపునిచ్చారు. బీజేపీతోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మిర్యాలగూడను బీజేపీ కంచుకోటగా మార్చి అక్కడ పార్టీ జెండా ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *