prajatantra_news

prajatantra_news

ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సంక్షేమం

– మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 24: ఇందిరమ్మ ప్రభుత్వం పేదల జీవితాల్లో మార్పు కోసం కట్టుబడి ఉందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని 59, 60 డివిజన్లలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం దానవాయిగూడెంలోని కార్తికేయ ఫంక్షన్‌ హాల్‌లో…

కేటీఆర్‌కు కేసీఆర్‌ దీవెనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన తండ్రి, పార్టీ అధినేత కల్వకుర్తి చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, పుత్రుడు హిమాన్షును తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్‌ తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తన పుత్రుడిని ఆలింగనం చేసుకున్న…

అందోల్‌లో మంత్రి దామోదర పర్యటన

– పలు నిర్మాణ పనుల పరిశీలన అందోల్‌, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆందోల్‌ నియోజకవర్గంలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా చౌటుకూరు మండల కేంద్రంలో ఓ హోటల్‌లో స్థానిక నాయకులతో మాట్లాడారు. హోటల్‌లో ఆకస్మిక తనిఖీ చేసి వంటకాలను పరిశీలించారు. ఫుడ్‌ సేఫ్టీ నిబంధలను పాటించాలని…

ఒక్క పథకం విప్లవాత్మక మార్పులకు కారణమైంది

మహాలక్ష్మి పథకంపై సీఎం రేవంత్‌ పోస్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: ఆర్టీసీలో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ పథకం వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు, ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ’ఎక్స్‌‘లో పోస్టు పెట్టారు. ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని పేర్కొన్నారు. కొందరు ఎగతాళి చేసినప్పటికీ ఈ…

మా లక్ష్య సాధనలో పాలుపంచుకోండి

– పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు – యూఏఈ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో పాలుపంచుకోవాలని యూఏఈ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.…

మరో ఘోర ప్రమాదం

కూలిన రష్యా ప్యాసింజర్‌ విమానం ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌ : అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం మరిచిపోకముందే చైనా సరిహద్దులో రష్యన్‌కు చెందిన విమాన ప్రమాదం మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రష్యన్‌ ప్యాసింజర్‌ విమానం ఏఎన్‌-24 చైనా సరిహద్దుల్లోని అముర్‌ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో 43మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు…

ప్రజాప్రతినిధుల కోర్టుకు సీతక్క హాజరు

– కోవిడ్‌ కాలంలో నిరసనలపై కేసుల్లో.. – ఆగస్టు 13కు విచారణ వాయిదా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: కోవిడ్‌ కాలంలో నిరసనకు సంబంధించి నమోదైన కేసులో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్కనాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. రూ.10 వేలతో రెండు షూరిటీలు కోర్టులో దాఖలు చేయగా…

ముగింపు దశకు బీహార్‌ ఓటర్ల జాబితా పరిశీలన

న్యూదిల్లీ, జులై 23: బీహార్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (ఎస్‌ఐఆర్‌) 2025 జూన్‌ 24న ప్రారంభమైందని, తొలి దశ ముగింపు దశకు వచ్చిందని భారత ఎన్నికల సంఘం తరపున ఉప సంచాలకుడు పి.పవన్‌ ఒక ప్రకటలో తెలిపారు. అర్హత లేని ఓటరు ఎవ్వరూ చేర్చకూడదని, అర్హులైన ఓటరు ఎవరూ మిగలకూడదనేది దీని మూల ఉద్దేశమని…

బొగత జలపాత సందర్శన నిలిపివేత

ములుగు, ప్రజాతంత్ర, జులై 23: అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 26 వరకు బొగత జలపాతం సందర్శన నిలిపివేస్తున్నట్లు ములుగు డీఎఫ్‌వో కిషన్‌ జాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ముత్యందార, కొంగర, మామిడిలొద్ది, కృష్ణపురం జలపాతాలను ప్రయాణీకుల భద్రతా కారణాల దృష్ట్యా శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎట్టి…

సమగ్ర పారిశ్రామికాభివృద్ధికి రోడ్‌మ్యాప్‌

ఎఫ్‌టీసీసీఐ కార్యక్రమంలో రామచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశంగా, గ్రామీణ ఆధారిత దేశంగా గతంలో భావించేవారు.. అయితే కాలక్రమంలో ఎంత దూరం వచ్చిందో గమనిస్తే అందరికీ గర్వంగా అనిపిస్తోంది.. 1947లో స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తే అభివృద్ధి మార్గంలో మన దేశం ఎంతో ముందుకు…