prajatantra_news

prajatantra_news

సాగులో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం

– రైతుల అభివృద్ధిలో తోడుగా ప్రజా ప్రభుత్వం – నాబార్డుతో ముడిపడి ఉన్న గ్రామీణ భారతం – 21వ శతాబ్దానికి అనువైన సంస్థలను నెల‌కొల్పుతాం – నాబార్డు ధ‌రిత్రీ స‌ద‌స్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: సంక్షోభ సమయాల్లోనే కాదు, రైతుల ప్రతి రోజూ అభివృద్ధి పయనంలో ప్రజా ప్రభుత్వం తోడుగా…

దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీపై ఆలోచించండి

– కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి సీఎం రేవంత్‌ సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్‌ షాపుల్లో వినియోగదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరించారు.…

సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం

– సౌదీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కేటీఆర్‌ పరామర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో దుర్మరణం పాలైన ముషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన యాత్రికుల కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాలను…

మాలవత్‌ పూర్ణ కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ

నిజామాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: అతి చిన్న వయసులో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్‌ పూర్ణ కుటుంబాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గురువారం పరామర్శించారు. పూర్ణ తండ్రి ఇటీవల మరణించగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలతో కలిసి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గల…

స్ఫూర్తిప్ర‌దాత చుక్కా రామ‌య్య‌

– జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ కోచింగ్‌ వ్యవస్థకు మార్గదర్శి అయిన చుక్కా రామయ్యకు మాజీ మంత్రి కేటీఆర్‌ 100వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యానగర్‌లోని నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థుల భవితను తీర్చిదిద్దిన వ్యక్తి…

చుక్కా రామయ్య సేవలు వెలకట్టలేనివి

– వందవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్య వందవ ఏట అడుగుపెట్టిన సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌ రావు ఆయనను కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ…

నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌ ఫెస్టివల్‌కు తెలంగాణ ఆతిథ్యం

– హైటెక్స్‌ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు – హాజరుకానున్న గవర్నర్‌, మంత్రి జూపల్లి, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: హైదరాబాద్‌ వేదికగా ‘తెలంగాణ- నార్త్‌ ఈస్ట్‌ ఇండియా కనెక్ట్‌.. ఏ టెక్నో-కల్చరల్‌ ఫెస్టివల్‌’ పేరిట సాంకేతిక, సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్‌,…

‘స్కిల్‌ కేపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ

– ‘ఏఐ’తో ఉద్యోగాలు పోతాయన్నది కేవలం అపోహే – సంక్షోభంతోపాటే కొత్త అవకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‘స్కిల్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణను మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, క్వాంటం కంప్యూటింగ్‌ లాంటి కటింగ్‌ ఎడ్జ్‌…

రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత

– ఏజెన్సీలో మరింత పడిపోతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌19: ‌రాష్ట్రంలో చలిగాలుల తీవ్ర పెరుగుతోంది. దీనికితోడు రాత్రపూట చలి పెరిగింది. ఏజెన్సీ జిల్లాల్లో చలి పంజావిసురుతోంది.  కొన్ని జిల్లాలలో వొచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో ఎల్లో అలర్ట్ ‌జారీ చేసినట్టు…

రేపు బీహార్‌ ‌సీఎంగా మరోమారు నితీశ్‌ ‌ప్రమాణం

– పదోసారి ప్రమాణం చేయబోతున్న నితీశ్‌ – ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎంపిక – గవర్నర్‌కు రాజీనామా స‌మ‌ర్ప‌ణ‌ – హాజ‌రుకానున్న‌ ప్రధాని మోదీ, అమిత్‌ ‌షా తదితరులు పాట్నా,నవంబర్‌ 19: ‌బీహార్‌లో నితీశ్‌ ‌కుమార్‌ ‌సారథ్యంలో ఎన్డీయే కొత్త ప్రభుత్వం గురువారం కొలువుతీరనుంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ ‌కుమార్‌…