NEWS

NEWS

ఐటి కంపెనీల్లో డ్రగ్స్ ‌ప్రకంపనలు

13 మంది ఉద్యోగులపై కంపెనీల వేటు మరో 50 మందికి నోటీసులు పోలీసుల జాబితాలో పేర్లు ఉండడంతో చర్యలు హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ ‌కేసులో..వాటిని తీసుకున్న ఐటీ ఉద్యోగులపై వేటు పడింది. 13 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది సాప్ట్‌వేర్‌ ఉద్యోగులకు నోటీసులు అందజేశాయి. పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్…

రైతు పండించిన పంటను కొనలేని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం

వడ్లు కొనుగోలు చేసేవరకు ఉద్యమం ఆగదు సిరిసిల్ల ధర్నాలో కేంద్రంపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని నోరు పారేసుకున్న గోయల్‌కు ఎంత బలుపు, కండకావరం అని మంత్రి కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం రైతులను వంచిస్తున్నదని కేటీఆర్‌ ‌విరుచుకుపడ్డారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం నిర్లక్ష్య పూరిత…

మా పార్టీ నిరసనలను అడ్డుకోవడం దారుణం

పోలీసుల తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పెట్రో, విద్యుత్‌ ‌చార్జీల పెపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌నిరసనలను అడుకున్న పోలీసులు రేవంత్‌ ‌సహా కాంగ్రెస్‌ ‌నేతల గృహనిర్బంధం బయటకు వొచ్చిన అనంతరం విద్యుత్‌ ‌సౌధ గేటు ముందు ధర్నా ఆందోళనను అడ్డుకోవడం కాదు…దమ్ముంటే విద్యుత్‌ ‌చార్జీలు తగ్గించండి….మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేతలు విద్యుత్‌ ‌సౌధ ముట్టడిలో…

మోడీ అంటే మోదుడు..బిజెపి అంటే బాదుడు

*కేంద్రం లాభనష్టాలు లెక్కలేసుకుని ప్రయివేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ లాగా పని చేస్తుంది *మోడీ హయాంలో అచ్చేదిన్‌ ‌కాదు…సచ్చేదిన్‌ ‌వొచ్చింది *సిద్ధిపేట టిఆర్‌ఎస్‌ ‌నిరసన దీక్షలో మంత్రి హరీష్‌రావు ఫైర్‌ మోడీ అంటే మోదుడు అని…బిజెపి అంటే బాదుడు అంటూ మంత్రి హరీష్‌ ‌రావు మరో కొత్త నిర్వచనం ఇచ్చారు. రైతులు పండించిన వడ్లను కొనమని తెగేసి…

దేశం కోసం, ధర్మం కోసం వడ్లు కొనాలి

కేంద్రం కొనే వరకు ఉద్యమం ఆగదు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ‌రైతు మహాధర్నాలు రైతులతో చెలగాటం వొద్దని కేంద్రానికి హితవు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌ ‌తన ఆందోళనలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, సమావేశాలతో నిరసనలు తెలిపింది. రైతుల ఇండ్లపై…

స్వామివారి కల్యాణానికి భద్రాద్రి ముస్తాబు

ఆలయమంతా రంగురంగుల విద్యుత్‌ ‌దీపాల అలంకరణ శరవేగంగా సిద్ధమవుతున్న కల్యాణ మండపం 10వ తేదీన స్వామివారి కల్యాణం…11న మహాపట్టాభిషేకం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి భద్రాద్రి ముస్తాబవుతుంది. 10వ తేది ఆదివారం నాడు స్వామివారి కల్యాణం, 11న మహాపట్టాభిషేకం జరుగనుంది. ఇందుకోసం భద్రాచలం…

తిమ్మాపూర్‌ ‌ప్లాంట్‌లో కోకాకోలా 600 కోట్ల పెట్టుబడులు

ప్రభుత్వంతో ఒప్పందం మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి కోకాకోలా సంస్థ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదని, 25 ఏండ్లుగా మంచి సేవలందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ ‌తెలిపారు. నూతన పరిశ్రమ కోసం ఇక్కడ 48.53 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం…

వరదసాయంలోనూ కేంద్రం వివక్ష

జాబితాలో తెలంగాణపేరు లేకపోవడం దారుణం ట్విట్టర్‌ ‌వేదికగగా మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పక్షపాత వైఖరిని ట్విట్టర్‌ ‌వేదికగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎండగట్టారు. 2021-22 సంవత్సరానికి ఆయా రాష్టాల్రకు కేటాయించిన వరద సాయం నిధుల జాబితాను ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌రెండు రోజుల క్రితం విడుదల చేసింది.…

రైతులను ఆదుకోకుండా ధర్నాలా?

కెసిఆర్‌పై మండిపడ్డ వైఎస్‌ ‌షర్మిల ‌రైతుల కోసం కొట్లాడుతున్నానన్న సీఎం కేసీఆర్‌ ‌కేంద్రం వద్ద ఎందుకు సంతకం పెట్టాడని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. రైతు సంక్షేమమే ముఖ్యమైతే ఆరోజు సంతకం పెట్టకుండా ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదని నిలదీశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ రైతు వేదిక వద్ద ధర్నాలో వైఎస్‌ ‌షర్మిల…

పెరుగుతున్న సిఎన్‌జి ధరలు

వరుసగా రెండోరోజు పెరిగిన రేట్లు ‌పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెరగడంతో సీఎన్‌జీ వాహనాలు వాడుదామని అనుకుంటే ఇప్పుడు దాని ధర కూడా పెరుగుతోంది. సీఎన్‌జీధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగి కిలో రూ.69.11కి చేరుకుంది. గత 2 రోజుల్లో, ఇందప్రస్థ గ్యాస్‌ ‌లిమిటెడ్‌ ‌సీఎన్‌జీ ధరలను కిలోకు రూ.…