అలంపూర్‌ ఎమ్మెల్యేపై  దాడి గర్హనీయం

– ఎంపి మల్లు రవి తక్షణం క్షమాపణలు చెప్పాలి
– మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ల  డిమాండ్‌

‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జనవరి 21: అలంపూర్‌ ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, నాగర్‌కర్నూల్‌ ఎం‌పీ మల్లు రవి దాడిని మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్ లు తీవ్రంగా ఖండించారు. మల్లు రవి దుర్భాషలాడుతూ విజయుడిపై చేయిచేసుకోవడం దారుణం, అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజా ప్రతినిధిపై దాడి అంటే ప్రజల తీర్పుపైనే దాడి అని స్పష్టం చేశారు. విజయుడిపై ఎంపీ దాడిని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేను బెదిరించడం, దాడి చేయడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన మల్లు రవిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.  ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్‌ ‌నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనమని తెలిపారు. ఎమ్మెల్యేను అవమానిస్తూ, శారీరక దాడికి దిగడం కాంగ్రెస్‌ ‌సంస్కృతి ఎంత దిగజారిందో అర్థమవుతుందని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని ఈ ఘటన మరోమారు స్పష్టం చేస్తోందన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు.. ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ‌నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

దాడికి కార‌ణం ఇదే

జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడ్‌ ‌గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడు మంగళవారం హాజరయ్యారు. భూమి పూజ కార్యక్రమంలో మొదట ఎంపీ కొబ్బరికాయ కొట్టగా తర్వాత ఎమ్మెల్యే పనులు ప్రారంభించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అలంపూర్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌కొబ్బరికాయ కొట్టేందుకు ముందుకు రావడంతో ప్రొటోకాల్‌ ‌లేని వ్యక్తులతో ఎలా కొట్టిస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన మల్లు రవి ఎవడ్రా నువ్వు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. విజయుడును తోసేయడంతోపాటు అక్కడున్న వారితోనూ దురుసుగా  ప్రవర్తించారు. దీంతో పోలీసులు ఎంపీని అదుపు చేశారు. సీనియర్‌ ఎం‌పీ రవి ఎమ్మెల్యేతో అమర్యాదగా మాట్లాడటాన్ని నియోజకవర్గ ప్రజలు తప్పుపడుతున్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి నడిగడ్డలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ అలజడి రేపుతున్నారని బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ గద్వాల నియోజకవర్గ ప్రజాప్రతినిధితో అమర్యాదగా మాట్లాడి, ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయ్యింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *